Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీటు బెల్టు ధరించకపోవడంతో ఛాతికి తీవ్రగాయాలు.. అందుకే నిషిత్ మృతి.. వైద్యులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నిషిత్ మరణంతో నారాయణ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అతివేగంతో పాటు వర్షం పడటం ద్వారా కారు అదుపుతప్

Advertiesment
Andhra minister
, బుధవారం, 10 మే 2017 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నిషిత్ మరణంతో నారాయణ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అతివేగంతో పాటు వర్షం పడటం ద్వారా కారు అదుపుతప్పి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత వేగంతో మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు రవి వర్మ మరణించారు. వీరు సీటు బెల్టు ధరించకపోవడంతో వీరిద్దరు మృతి చెందారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన అత్యాధునిక కారులో ప్రయాణించారు. దీని ధర రెండున్నర కోట్లని సమాచారం. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. యూరో ప్రమాణాలతో ఈ కారు తయారైంది. ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు అత్యున్నత రక్షణ వ్యవస్థను కలిగిన ఈ కారులో ఏడు గేర్లు ఉంటాయి. 
 
ఇలాంటి అత్యున్నత ప్రమాణాలతో తయారైన కారులో వెళ్ళినా అతివేగం నారాయణ కుమారుడిని పొట్టనబెట్టుకుంది. నిషిత్ నారాయణ, రవివర్మ ప్రయాణించిన కారు  వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అపోలో ఆసుపత్రిలో ఉస్మానియా వైద్యులు పోస్టు మార్టం పూర్తి చేశారు. అతివేగంతోనే వీరి మరణం సంభవించిందని.. మృతులు మద్యం తాగినట్లు ఆనవాళ్లు లేవని తేల్చారు. 
 
ఈ ప్రమాదంలో నిషిత్ ఛాతి, పక్కటెముకలు విరిగాయని తెలిపారు. నిషిత్ డ్రైవింగ్ చేస్తున్నాడని.. బలంగా పిల్లర్‌ను కారు తాకడంతోనే వారు మృతి చెందారని.. రవివర్మ కంటే నిషిత్‌కే ఎక్కువ దెబ్బలు తగిలాయని, ఛాతికి తీవ్ర గాయం కావడంతో నిషిత్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంటులో పాపాయికి పాలిచ్చి రికార్డు సృష్టించిన మహిళా సెనేటర్